తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి వైసీపీలో చేరిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తో తనకు ప్రాణహాని ఉందని వైసీపీ కి చెందిన ఒక యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. చలో తాడేపల్లి కార్యక్రమంలో అరెస్ట్ అయిన రామిశెట్టి నాగ వెంకట సాయి ఉమామహేశ్వరరావు బాపులపాడు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి.
నిన్న సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంటికి వచ్చి వార్నింగ్ ఇచ్చారని ఉమామహేశ్వరరావు ఆరోపించాడు. కొందరు వ్యక్తులు వచ్చి ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేస్తే ఊరుకునేది లేదని తన మొబైల్ లాక్కున్నారని దీంతో బాపులపాడు మండలం, హనుమాన్ జంక్షన్ పోలీసులను ఆశ్రయించినట్లు ఉమామహేశ్వరరావు తెలిపాడు.