భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీకి భద్రత కల్పించడంలో సెంట్రల్ రిజర్వ్ సెక్యూరిటీ ఫోర్స్ (CRPF) విఫలం అయిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది. అయితే రాహుల్ గాంధీ భద్రతా నిబంధనలను స్వయంగా ఉల్లంఘిస్తున్నారని సెంట్రల్ రిజర్వ్ సెక్యూరిటీ ఫోర్స్ ఆరోపించింది. రాహుల్ గాంధీకి భద్రత కల్పించే విషయంపై పార్టీ నేత కెసి వేణుగోపాల్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.
ఇప్పుడు దీనికి సంబంధించి సెంట్రల్ రిజర్వ్ సెక్యూరిటీ ఫోర్స్ (CRPF) నుంచి సమాధానం వచ్చింది. భద్రతకు సంబంధించి జారీ చేసిన మార్గదర్శకాలను రాహుల్ గాంధీ స్వయంగా ఉల్లంఘించారని సీఆర్పీఎఫ్ పేర్కొంది. ఈ భద్రతా ఉల్లంఘనలపై రాహుల్కు ఎప్పటికప్పుడు సమాచారం అందజేస్తున్నామని వారు తెలిపారు. 2020 నుంచి ఇప్పటి వరకు రాహుల్ గాంధీ 113 సార్లు భద్రతా నిబంధనలను ఉల్లంఘించారని సీఆర్పీఎఫ్ తెలిపింది. ఈ విషయాన్ని ప్రతిసారీ ఆయనకు తెలిపినట్టు కూడా వెల్లడించారు.
భారత్ జోడో యాత్ర లో రాహుల్ గాంధీతో పాటు వచ్చిన వ్యక్తులు భద్రతా నిబంధనలను తరచూ ఉల్లంఘిస్తున్నారని CRPF తెలిపింది. రాహుల్కు అన్ని భద్రతా ఏర్పాట్లు చేసినట్లు భద్రతా దళం తెలిపింది. ఆయన భద్రత కోసం సిఆర్పిఎఫ్, రాష్ట్ర పోలీసు ఇతర భద్రతా సంస్థల సహకారంతో సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబరు 24న భారత్ జోడో యాత్ర ఢిల్లీకి చేరిన తర్వాత అనేక భద్రతా ఉల్లంఘనలు జరిగాయని కాంగ్రెస్ నేత వేణుగోపాల్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.
యాత్రలో పెరుగుతున్న జనాలను నియంత్రించడంలో, Z ప్లస్ భద్రత కలిగిన రాహుల్ గాంధీ చుట్టూ భద్రతా వలయాన్ని నిర్వహించడంలో ఢిల్లీ పోలీసులు అనేక సందర్భాల్లో ఘోరంగా విఫలమయ్యారని ఆయన తెలిపారు. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే రాహుల్ గాంధీ వెంట వచ్చేవారు, కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన చుట్టూ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారని ఆయన తెలిపారు. ఢిల్లీ పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆయన ఆరోపించారు.