28.7 C
Hyderabad
April 27, 2024 06: 21 AM
Slider విశాఖపట్నం

కలకలం రేపిన గోబ్యాక్ సీఎం సార్ పోస్టర్లు

#janajagaranasamiti

ఒక వైపు ఎమ్మెల్సీ ఎన్నికలలో వ్యతిరేక ఫలితాలు వస్తుండగా మరో వైపు ‘గో బ్యాక్ సీఎం సార్’ అంటూ విశాఖలో ఫ్లెక్సీలు కనిపించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేకెత్తిస్తున్నది. విశాఖ పట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ముందే ‘గో బ్యాక్ సీఎం సార్’ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వైసీపీ వారిని షాక్ కు గురి చేసింది. అమరావతినే రాజధానిగా ఉంచాలంటూ ఫ్లెక్సీలలో రాశారు. ఒక్క సారిగా విశాఖ వాసులు ఈ విధంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ కు షాక్ ఇస్తారని ఎవరూ ఊహించలేదు. ‘గో బ్యాక్ సీఎం సార్’ అంటూ విశాఖలో ఫ్లెక్సీలు ఏర్పాటు కావడంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. విశాఖలోని జగదాంబ, సిరిపురం, ఏ యూ, మద్దిలపాలెం వంటి ప్రాంతాల్లో ఈ పోస్టర్లు కనిపించాయి. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వైసీపీ శ్రేణులు వాటిని తొలగించాయి. జన జాగరణ సమితి పేరుతో ఈ పోస్టర్లు వెలిశాయి.

Related posts

క‌రోనా ఆంక్ష‌ల‌తో హిందువుల పండ‌గుల‌పై ఆంక్ష‌లా…?

Satyam NEWS

శేషవాహనంపై ఒంటిమిట్ట కోదండరాముడు

Satyam NEWS

చీఫ్ జస్టిస్ గా ఎన్ వి రమణ పేరు సిఫార్సు

Satyam NEWS

Leave a Comment