ఒక వైపు ఎమ్మెల్సీ ఎన్నికలలో వ్యతిరేక ఫలితాలు వస్తుండగా మరో వైపు ‘గో బ్యాక్ సీఎం సార్’ అంటూ విశాఖలో ఫ్లెక్సీలు కనిపించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేకెత్తిస్తున్నది. విశాఖ పట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ముందే ‘గో బ్యాక్ సీఎం సార్’ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వైసీపీ వారిని షాక్ కు గురి చేసింది. అమరావతినే రాజధానిగా ఉంచాలంటూ ఫ్లెక్సీలలో రాశారు. ఒక్క సారిగా విశాఖ వాసులు ఈ విధంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ కు షాక్ ఇస్తారని ఎవరూ ఊహించలేదు. ‘గో బ్యాక్ సీఎం సార్’ అంటూ విశాఖలో ఫ్లెక్సీలు ఏర్పాటు కావడంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. విశాఖలోని జగదాంబ, సిరిపురం, ఏ యూ, మద్దిలపాలెం వంటి ప్రాంతాల్లో ఈ పోస్టర్లు కనిపించాయి. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వైసీపీ శ్రేణులు వాటిని తొలగించాయి. జన జాగరణ సమితి పేరుతో ఈ పోస్టర్లు వెలిశాయి.
previous post
next post