కడప జిల్లా రాజంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం రైతు దగా దినోత్సవం ను టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు ఆధ్వర్యం లో టీడీపీ శ్రేణులు నిర్వహించారు.
దెబ్బ తిన్న పొలాల్లో నిలబడి వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా భత్యాల చెంగల రాయుడు మాట్లాడుతూ రైతులను దగా చేసి రైతు దినోత్సవం నిర్వహించే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదని, రైతు దినోత్సవం కాదు – రైతు దగా దినోత్సవం అని ఆయన విమర్శించారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా “రైతు దగా దినోత్సవం” నిర్వహించినట్టు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.