42.2 C
Hyderabad
April 26, 2024 18: 50 PM
Slider ప్రకాశం

హత్య కేసులో వైసీపీ కీలక నేత అనుచరుడి అరెస్టు

#prakasham dist police

ప్రకాశం జిల్లా చీరాలలో జరిగిన ఒక హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. గత నెల 15 న బందా వారి వీధి లో నివశించే కర్నాటి విజయలక్ష్మీ అనే మహిళ హత్యకు గురైంది.

61 సంవత్సరాల ఆ మహిళపై దాడి చేసి హత్యచేసిన ఈ సంఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. చీరాల ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ వలయాధికారి అంబటి రాజమోహన్,ఎస్.ఐ. నాగశ్రీను,వేటపాలెం ఎస్.ఐ. కే. కమలాకర్ అద్దంకి స్పెషల్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ మహేష్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి కొద్ది రోజుల్లోనే కేసును పరిష్కరించారు.

తులాబందు సాంబశివరావు (51) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా అతను చేసిన నేరం ఒప్పుకుని లొంగిపోయాడు.

తులాబందు సాంబశివరావు రెవిన్యూ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ వద్దకు వెళ్లి తాను చేసిన నేరాన్ని ఒప్పుకో గా ఆయన తమకు అప్పగించారని పోలీసులు తెలిపారు.

కర్నాటి విజయలక్ష్మి పై తులాబంధు సాంబశివరావు అత్యాచార యత్నం చేశాడని పోలీసులు తెలిపారు. దానికి అమె ప్రతిఘటించడంతో హత్యకు పాల్పడినట్లుగా పోలీసులు నిర్దారించారు.

ఈ కేసును ఛేదించిన వన్ టౌన్ సీఐ రాజమోహన్,ఎస్సై మహేష్, సిట్ టీం కు డీఎస్పీ శ్రీకాంత్ అభినందనలు తెలియజేశారు.

అదే విధంగా జిల్లా పోలీస్ అధికారి శిద్దార్ద్ కౌశల్ కూడా వీరిని అభినందించారు.

ఈ హత్య కేసులో అరెస్టు అయిన వ్యక్తి చీరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకుడి ప్రధాన అనుచరుడు కావడం గమనార్హం.

Related posts

ద్వారకా తిరుమల అన్నదానం ట్రస్టుకు విరాళం

Satyam NEWS

యువ తెలంగాణ పార్టీ కార్యాలయం ప్రారంభం

Sub Editor

సిజెఐ ని కలిసిన గోరేటి

Sub Editor 2

Leave a Comment