పార్టీ రహితంగా జరుగుతున్న పంచాయితీ ఎన్నికలకు పార్టీ తరపున ఎన్నికల ప్రణాళికను విడుదల చేసిన తెలుగుదేశం పార్టీని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తప్పు పట్టారు.
మేనిఫెస్టో విడుదల చేయడంపై టీడీపీ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో టీడీపీ మేనిఫెస్టోను రద్దు చేస్తున్నట్లు ఎస్ఈసీ వెల్లడించారు.
వెంటనే మేనిఫెస్టోను వెనక్కు తీసుకోవాలంటూ టీడీపీకి ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా జిల్లాలకు పంపిన మేనిఫెస్టో కాపీలను వెనక్కి తీసుకోవాలని కూడా ఆయన టీడీపీని ఆదేశించారు.
మేనిఫెస్టోతో ఎలాంటి ప్రచారం నిర్వహించొద్దని ఎస్ఈసీ స్పష్టం చేసింది.
పార్టీలకు సంబంధం లేకుండా జరిగే పంచాయతీ ఎన్నికలకు టీడీపీ మేనిఫెస్టో ప్రకటించడంపై ఎస్ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేయగా మేనిఫెస్టోపై టీడీపీని ఎస్ఈసీ వివరణ కోరిన విషయం తెలిసిందే.
టీడీపీ నుంచి సంతృప్తికర సమాధానం రాకపోవడంతో మేనిఫెస్టోను రద్దు చేసినట్లు ఎస్ఈసీ ప్రకటించారు.